దోమకొండ గడికోటలో త్రివర్ణ పథకం ఎగురవేసిన కామినేని అనిల్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక గడికోటలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దోమకొండ కోట వారసుడు కామినేని అనిల్ త్రివర్ణ పథకం సోమవారం ఎగరవేశారు. ప్రతి ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పథకంలో ఎగురవేశారు. అనంతల ఈ సందర్భంగా మాట్లాడుతూ. మా పూర్వికులు పరిపాలించిన దోమకొండ సంస్థానంను తన సొంత నిధులతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మన సాంస్కృతి, మన తెలంగాణ, మన భారతదేశం కు ప్రతి ఒక్కరు విధేయులుగా పనిచేయాలని సూచించారు. దోమకొండను అన్ని రంగాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.


