నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..!

నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..!

*కామారెడ్డిఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 21 (అఖండ భూమి న్యూస్);

 

ఖాదీ అంటే కలెక్షన్లు కాదు సర్వీస్ అనే దిశగా నేను పని చేస్తున్న.

నేను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చామని చెప్పుకుంటూ ఇంచార్జీ మంత్రిని తీసుకువచ్చి షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

గత రెండు ఏళ్లుగా కామారెడ్డి నియోజకవర్గంలో నేను ఏమి మాట్లాడకుండా ఉంటే ఈ నియోజకవర్గానికి నవాబులాగ షబ్బీర్ అలీ చెలాయిస్తున్నారు.

ఎదుటి వాళ్ళు బూతులు మాట్లాడే స్థాయికి నీ ప్రవర్తన మారింది.

ప్రభుత్వ కళాశాలకు చెందిన భూములను లీస్ కు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలకు ఆ స్థలాల కిరాయిలు వస్తున్నాయి.

కళాశాల భూములకు సంబంధించి ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన విమర్శలకు అతన్ని ప్రభుత్వ కళాశాల వద్దకు చర్చకు రమ్మంటే కాంగ్రెస్ నాయకులు వందల సంఖ్యలో వచ్చి నా క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు.

నేను చేసిన సవాల్ కు ఉదయం ప్రభుత్వ కళాశాల వద్దకు వద్దామంటే కామారెడ్డి శాంతి భద్రతల దృష్ట నన్ను బయటకి రావద్దంటే వారికి సహకరించి నేను బయటకు రాలేదు.

గతంలో ఎన్నిసార్లు పోటీ చేసినా, ఎక్కడ పోటీ ఓటమిపాలైన షబ్బీర్ అలీ అవినీతి బాగోతం గురించి ముఖ్యమంతి రేవంత్ రెడ్డి కి చెప్పడం జరిగింది.

ఇప్పటి వరకు కామారెడ్డిలో ఏది జరిగిన భరించా ఇక నుండి భరించే ప్రసక్తే లేదు.

ప్రభుత్వ కళాశాల ఆస్తుల విషయంలో నేను ఏమైనా అవినీతి చేసినట్టు డాక్యుమెట్స్ ఫ్రూప్స్ తో నిరూపిస్తే జిల్లా కలెక్టర్ ఉండి శాసన సభ స్పీకర్ సలహాతో నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డి ప్రభుత్వ కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలని నేను మా నాన్నతో అప్పటి ముఖ్యమంతి రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడినా అప్పుడు ఈ షబ్బీర్ అలీ మంత్రి హోదాలో ఉండి కూడా కామారెడ్డికి ఏమి చేయని వ్యక్తి.

నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.

వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తా మీరు అసలైన నాయకులైతే ఆ రోజు వచ్చి నా తప్పు నిరూపించి మోగోళ్ళు అనిపించుకోండి.

మా కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో నా నిజాయితీ నిరూపించుకునేదాక ఊరుకునే ప్రసక్తే లేదు..

సినిమా ఇప్పుడే మొదలైంది టైలర్ మాత్రమే వదిలాము.

కార్యకర్తలను ఎవరిని రావొద్దంటేనే ఇలా ఉంది.

కార్యకర్తలు అందరినీ పిలుపునిస్తే ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా..

రేపటి నుంచి గ్రామాలలో తిరుగుతా ఎవరొస్తారు రండి,

ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి..

నాతో వచ్చేవారు వస్తారు..

నేను ఏ తప్పు చేయలేదు..

మున్సిపాలిటీలో తప్పు జరగకుండా చూస్తానని చెప్పాను అంతే..

కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాయి..

తప్పు జరగకుండా చూస్తానన్నందుకే అక్కస్సుతో నాపై ఈరోజు దాడికి దిగారూ

Akhand Bhoomi News

error: Content is protected !!