అంబారీపేట సర్పంచ్ పరుట్ల కవిత అనిల్ రేణుక , జమదగ్నిల కళ్యాణం కు పట్టు వస్త్రాలు పుస్తే మట్టెలు అందజేత… …

అంబారీపేట సర్పంచ్ పరుట్ల కవిత అనిల్ రేణుక , జమదగ్నిల కళ్యాణం కు పట్టు వస్త్రాలు పుస్తే మట్టెలు అందజేత… …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 !(అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ. మండలంలోని అంబారిపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయం 6 వ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు రంగోలి మైసా గౌడ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ , జమదగ్నియుల కళ్యాణం ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబరీపేట సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తే మట్టెలు అందజేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గౌడ సంఘం సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేసి, మహిళలతో మొక్కులు తీర్చుకున్నారు. 24వ తేదీ మంగళవారం రోజున రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం వేడుకలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రోజున తిరుగు బోనాలు విందు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగోలి సత్య గౌడ్, గౌడ సంఘం సభ్యులు రంగోలు శ్రీనివాస్ గౌడ్, మైసా గౌడ్, లింగా గౌడ్, ఈశ్వర్ గౌడ్, తదితరులు , గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!