రామునికి రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం…
*రేవంత్ రెడ్డి నీ ఓడించినందుకే కామారెడ్డి ప్రజలపై కక్ష కట్టారు..
*కొడంగల్ కి నిధులు కామారెడ్డి కి గొడవలు..
*కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు..
*బీజేపీ తోనే తెలంగాణ అధివృద్ధి సాధ్యం..
*ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 24 ( అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి కి ప్రయత్నించిన నేపథ్యంలో గత మూడు రోజులు గృహనిర్బంధంలో ఉన్న కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కి మద్దతుగా ఆర్మూర్ శాసన సభ్యులు రాకేష్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వచ్చి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. క్యాంపు కార్యాలయంపై దాడులు అన్యాయం, అక్రమం అని ఖండించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం షబ్బీర్ అలీ నీ అద్దం పెట్టుకొని ఫ్రోటోకాల్ పాటించడం లేదు ఇకపై యుద్ధమే ఉంటుంది. అది రామునికి రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రేవంత్ రెడ్డి నీ ఓడించినందుకే కామారెడ్డి ప్రజలపై కక్ష కట్టారనీ అన్నారు. కొడంగల్ కి నిధులు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి కామారెడ్డి కి గొడవలు తెస్తున్నారని అన్నారు. బీజేపీ తోనే తెలంగాణ అధివృద్ధి సాధ్యం అని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయమే గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు వివరాల పై కలెక్టర్ , శ్వేత పత్రం విడుదల చెయ్యాలి .
ఉద్యోగుల ఆరోగ్య కార్డులు – ఈ హెచ్ ఎస్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగులు…
అంబారీపేట సర్పంచ్ పరుట్ల కవిత అనిల్ రేణుక , జమదగ్నిల కళ్యాణం కు పట్టు వస్త్రాలు పుస్తే మట్టెలు అందజేత… …
కామారెడ్డి జిల్లా డిఎంహెచ్వో గా రవీందర్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ విందుకి ఆహ్వానించిన హీరో ఆనంద్ దేవరకొండ…


