దోమకొండ నూతన జిపి పాలకవర్గాన్ని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ గ్రామ పాలకవర్గ మొదటి సమావేశం సందర్భంగా శుక్రవారం పాలకవర్గాన్ని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి శాలువాలు కప్పి సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ మరియు వార్డు సభ్యులందరికీ శాలువాలు కప్పి సన్మానించారు. నూతన పాలకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వము తోడ్పాటు నిస్తుందని అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా స్వామి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ గజవాడ శ్రీకాంత్ పాలకుర్తి శేఖర్ గఫర్ నిమ్మ నర్సింలు ఐరేని రాజేందర్ బొబ్బసాని సుధాకర్ వార్డ్ సభ్యులు కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు
You may also like
ప్లాస్టిక్ నివారించడమే భవిష్యత్ తరాలు సైతం ముందుండాలి…
బి టి ఎస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ….
బెల్లంపల్లి పాతికేళ్ల కల నెరవేరేన ప్రజల చిరకాల కోరిక తీరేనా
ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్
దోమకొండలో ప్రధాన డ్రైనేజీ లో పనులను ప్రారంభించిన సర్పంచ్…


