జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు…
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 28. (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (మార్చి 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపినారు.
అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
You may also like
బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కామారెడ్డి లో బిజెపి శాసనసభ పక్ష సమావేశం…
దోమకొండ జిపి పాలకవర్గం ప్రమాణ స్వీకారం కు లక్ష 38 వేల రూపాయల ఖర్చుపై గ్రామ సభలో రభస…
ప్లాస్టిక్ నివారించడమే భవిష్యత్ తరాలు సైతం ముందుండాలి…
దోమకొండ నూతన జిపి పాలకవర్గాన్ని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి…
బి టి ఎస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ….


