పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 1 (అఖండ భూమి న్యూస్);
పేదలకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలను అందిస్తుందని దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్. , జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి లు అన్నారు. మండలంలోని చింతమాను పల్లి గ్రామంలో నీల లక్ష్మీ -నవీన్ కు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన ఉంటుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆదేశానుసారం తాము ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ అక్షర శ్రీనివాస్ ,డైరెక్టర్ గోపాల్ రెడ్డి, సీతారాo మధు. శంకర్ రెడ్డి, సంజీవరెడ్డి,శేఖర్, లావణ్య, బాలమణి, అబ్రా బోయిన రాజేందర్, షమ్మీ బాల్ నర్సు సాల్రా రాజు.తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడైన నీల లక్ష్మీ నవీన్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు బట్టలు పెట్టి గౌరవించారు.


