ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 02 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా సోమవారం నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతు తెలిపారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడుతూ వారికి మద్దతు ప్రకటించారు.


