కలెక్టరేట్ ప్రజావాణి కి 113 దరఖాస్తులు…

కలెక్టరేట్ ప్రజావాణి కి 113 దరఖాస్తులు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 02 (అఖండ భూమి న్యూస్);

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, జడ్పీ సీఈఓ చందర్ లతో కలసి అర్జీలను అర్జీదారుల నుండి ఫిర్యాదు దరఖాస్తు లు స్వీకరించారు.

ఈ ప్రజావాణిలో 113 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఆయా శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, పెన్షన్ , ఇందిరమ్మ ఇళ్లు, తదితర వాటి పై అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు.

సంబంధిత అధికారులు అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలని, తహసీల్దార్లు, సంబంధిత జిల్లా అధికారులు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!