ఈ నెల 15న హన్మకొండలో జరుగు దశాబ్ది మహాసభ*గోదాపొస్టర్లు విడుదల
బెల్లంపల్లి మార్చి 10(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న జరుగు దశాబ్ది మహాసభ గోడ పోస్టర్లు విడుదల చేసారు.ఈ సందర్బంగా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గెల్లి రాజలింగు మాట్లాడుతూ…ఈ నెల హన్మకొండలో జరుగు దశాబ్ది మహాసభలకు హమాలీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభ ను విజయవసంతం చేయాలన్నారు.హమాలీలకు పీఏఎఫ్,అలాగే ఈఎస్ఐ అమలు చేయుటకు, అలాగే హమాలీలకు తగు న్యాయం జరగాలని హన్మకొండలో జరుగు మహా సభకు అందరు కదలి రావాలని అయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు…



