మాజీ మంత్రి షబ్బీర్ ను కలిసిన కర్ణాటక మంత్రి రహీం ఖాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 16 (అఖండ భూమి న్యూస్);
కర్ణాటక రాష్ట్ర మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ , హాజ్ శాఖ మంత్రి శ్రీ రహీమ్ ఖాన్ పవిత్ర హాజ్ కు వెళ్తున్న సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. హైదరాబాద్ లో ఆయనకు షబ్బీర్ అలీ నివాసంలో గౌరవ మర్యాదలతో పాటు విందు అందించారు. ఆయనతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల పై చర్చించారు.


