క్రిప్టో పేరుతో రూ.13 కోట్లు మోసపోయిన వైద్యుడు…
పెట్టుబడి పెట్టించి..నట్టేట ముంచిన సైబర్ నేరగాళ్లు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 18 (అఖండ భూమి న్యూస్);
గుంటూరులోని ప్రముఖ ప్రైవేటు వైద్యుడు క్రిప్టోకరెన్సీ పేరుతో పెట్టుబడులు పెట్టి రూ.13 కోట్లు మోసపోయారు.
దీనిపై పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
వైద్యుడు తనతోపాటు మరికొందరు స్నేహితుల సొమ్ము కూడా ఇందులో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసింది.
క్రిప్టోకరెన్సీ పేరుతో ఆన్లైన్లో అధిక లాభాలు ఆశ చూపగా.. వైద్యుడు భారీగా పెట్టుబడి పెట్టారు.
తొలుత లాభాలు చూపించి, మరింత సొమ్ము పెట్టేలా నమ్మకం కలిగించడంతో బాధితుడు ఈ మొత్తం పెట్టారు.
చివరికి ఆన్లైన్ ఖాతాలో డబ్బులు కనిపిస్తున్నా.. వాటిని తీసుకోలేక పోతున్నారు. దీంతో మోసపోయినట్లు గ్రహించారు.
You may also like
కామారెడ్డి జిల్లా చేనేత తుది ఓటర్ల జాబితా విడుదల…
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరదలపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ ..
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్ కూటమి ప్రభుత్వం నుండి మరొక బంపర్ కార్యక్రమం – రూపాయి చెల్లించకుండానే 41 మెడికల్ టెస్ట్లు!
మహేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -2ను ప్రారంభించిన చైర్ పర్సన్
పెళ్లిని వ్యాపారంగా మార్చిన యువతా మేల్కోండి!_


