ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 22 (అఖండ భూమి న్యూస్);
సామాజిక సంస్కర్త, దళితోద్యమ ప్రముఖ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన గావించి, భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. విద్య, సామాజిక సమానత్వం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యే ప్రధాన ఆయుధమని భావించి, వారికి చైతన్యం కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు.
భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమానత్వ భావనతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, SC డెవలప్మెంట్ officer వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
పారదర్శక పరిపాలన అందించడమే రేవంత్ రెడ్డి సర్కార్ ధ్యేయం…
*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…*
ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు – కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం 22 న సత్య కన్వెన్షన్ హాల్


