తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్)
ఆదిలాబాద్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళుర్పించారు.
ఈ సందర్బంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెళ్ళాకట్టలేనివాని అన్నారు.
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం శుబిక్షంగా తీర్చిదిద్దడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్స్పీ, మున్సిపాల్ చైర్మన్ బండారి అనూష సతీష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, కౌన్సిలర్ స్వాతి కాంలే, ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్, సుజాత, కృష్ణ రెడ్డి, అనిల్, కొండా గంగాధర్, బాబన్న, తతిదారులు పాల్గొన్నారు.


