నూతన కల్వర్ట్ కు భూమి పూజ చేసిన చైర్ పర్సన్
బెల్లంపల్లి జూన్04(అఖండ భూమి న్యూస్):గత కొన్ని రోజులుగా బెల్లంపల్లి పట్టణంలోని,బెల్లంపల్లి బస్తీ 19వ వార్డ్ లో కల్వర్టు కుంగిపోయి బస్తీ ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు,బెల్లంపల్లి మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు తీర్మానించిన విధంగా మున్సిపాలిటీ గ్రాంట్ నిధులు రూ.5లక్షల నిధులతో నూతన కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.నూతన కల్వర్టు నిర్మాణంతో బస్తీ ప్రజలు,వాహనదారుల కష్టాలు తీరనున్నాయని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు.ఈ కార్యక్రమంలో 19వ వార్డ్ కౌన్సిలర్ సిమ్రాన్ షేక్,మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ గౌస్,కాంపెల్లి శ్రీనివాస్,ప్రదీప్ గారు,మరికొంత మంది సీనియర్ నాయకులు,బస్తీ వాసులు ఈట రాకేష్ తదితరులు పాల్గొన్నారు…
You may also like
మొబైల్ రీఛార్జ్లపై మళ్లీ భారం..? త్వరలో టారిఫ్ల పెంపుకు సంకేతాలు..!
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్…
రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
చరిత్రకు పుట్టినిల్లు – అభివృద్ధికి చిరునామా: మన కామారెడ్డి జిల్లా సంపూర్ణ విశ్లేషణ…
రైతులకు నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించాలి…



