*ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్5 (అఖండ భూమి న్యూస్);
ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహా బీచ్ షాక్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ పాలసీ కింద విశాఖపట్నం, చీరాల బీచ్లలో తాత్కాలిక బీచ్ ఫ్రంట్ బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటకులకు మద్యం, సీఫుడ్, స్నాక్స్ తదితర ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటి నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు.
దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
You may also like
మొబైల్ రీఛార్జ్లపై మళ్లీ భారం..? త్వరలో టారిఫ్ల పెంపుకు సంకేతాలు..!
రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
చరిత్రకు పుట్టినిల్లు – అభివృద్ధికి చిరునామా: మన కామారెడ్డి జిల్లా సంపూర్ణ విశ్లేషణ…
రైతులకు నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించాలి…
మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్


