మొబైల్ రీఛార్జ్లపై మళ్లీ భారం..? త్వరలో టారిఫ్ల పెంపుకు సంకేతాలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 5 (అఖండ భూమి న్యూస్);
దేశంలోని కోట్లాది మొబైల్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు, మరోసారి టెలికాం టారిఫ్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే 3 నుంచి 6 నెలల్లో మొబైల్ రీఛార్జ్ టారిఫ్లు సుమారు 10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.
సీఎన్బీసీ-టీవీ18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గతంలో జరిగినట్లుగా 15 నుంచి 20 శాతం భారీ పెంపులు ఈసారి అవసరం లేదని, కానీ టెలికాం సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు పరిమిత స్థాయిలో ధరల సవరణ జరిగే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ప్రధాన టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, భారతి ఐటెల్, వోడాఫోన్స్, ఐడియా తమ సేవల నాణ్యత, ఫైవ్ జి విస్తరణ, నెట్వర్క్ నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని టారిఫ్లను పునఃసమీక్షిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాది కూడా టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడింది. ముఖ్యంగా రోజువారీ డేటా వాడే విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇప్పుడు మరోసారి ధరల పెంపు జరిగితే నెలవారీ మొబైల్ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ పెంపు అన్ని ప్లాన్లపై సమానంగా ఉండకపోవచ్చని, ముఖ్యంగా అధిక డేటా వినియోగ ప్లాన్లు, అన్లిమిటెడ్ కాలింగ్ ప్యాకేజీలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. 5G సేవల విస్తరణ నేపథ్యంలో కంపెనీలు పెట్టుబడులను తిరిగి పొందేందుకు టారిఫ్ సవరణలు చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు టెలికాం కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, రాబోయే నెలల్లో మొబైల్ రీఛార్జ్ ఖర్చులు పెరిగే అవకాశాన్ని వినియోగదారులు ముందుగానే అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
You may also like
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్…
రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
చరిత్రకు పుట్టినిల్లు – అభివృద్ధికి చిరునామా: మన కామారెడ్డి జిల్లా సంపూర్ణ విశ్లేషణ…
రైతులకు నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించాలి…
మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్


