*ఓటర్ లిస్ట్ లో కేంద్ర మాజీ మంత్రి పేరు గల్లంతు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్);
సాక్షాత్తూ అధికార పార్టీ కీలక నేత మాజీ మంత్రి, ఆ నియోజకవర్గ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరే ఓటర్ల జాబితా లో గల్లంతయ్యిందంటే .. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎంత నాణ్యంగా జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు.
ఓటర్ల లిస్ట్ లో పేర్లు కోల్పోయిన వారందరూ రోహింగ్యాలు పాక్ బంగ్లాదేశ్ వాళ్ళు అని వాదించే మూర్ఖులకు ఇప్పటికైనా అర్థం అవ్వాలి.
ఉత్తర ప్రదేశ్ లో జూన్ 10వ తేదీన పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రకటించగా అందులో స్మృతి ఇరానీ పేరు కనిపించలేదు. దీనిపై ప్రస్తుతం విచారణకు ఆదేశించినట్టు అమేథీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ మీడియాకు తెలిపారు.నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం తెలుస్తుందని చెప్పారు.
కాబట్టి అందరూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.


