మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ…

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో*అన్న ప్రసాదం..
350 మందికి అన్నప్రసాద వితరణ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 16 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో మంగళవారం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,డాక్టర్ బాలు మాట్లాడుతూ. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజా సమస్యల పరిష్కారానికి కావలసిన శక్తిని మా భగవానుని ప్రసాదించాలని, మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆలయంలో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 350 మందికి అన్న ప్రసాదాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో కొమిరిశెట్టి దిగంబర్,దొంతి సుధాకర్,రాజమణి,పప్పుల శ్రావణి,పాత స్వరూప,నీల అద్విక్ సాయి,నీల సాయి అద్విత లు పాల్గొన్నారు.


