నేను ప్రతీకారం మొదలెడితే ఊహకు కూడా అందదు!: నెల్లూరు డిప్యూటీ మేయర్‌

 

నెల్లూరు: నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు..

ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్‌ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ”వైకాపా ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారు. హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారు. కేవలం నాతో ఉన్నాడనే కక్షతోనే దాడి జరిగింది. బాధితుడు చెబుతున్నట్టు ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ఉన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు. గతంలోనూ నా అనుచరులపై దాడులు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ మరోసారి దాడి జరిగి ఉండేది కాదు. ఇకపై మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. నేను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదు. ఈ ఘటనను సీఎం జగన్‌, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. నెల్లూరులో వైకాపాను సర్వనాశనం చేస్తున్నారు” అని రూప్‌కుమార్ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ తీరుపై ఆయన బాబాయ్‌ (డిప్యూటీ మేయర్) రూప్ కుమార్ యాదవ్ పద్యం రూపంలో విమర్శలు గుప్పించారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

Akhand Bhoomi News

error: Content is protected !!