బదిలీపై వచ్చిన ఎంపీడీవోని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిషత్ నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కి దోమకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా మంగళవారం సన్మానించారు. దోమకొండ మండల పరిషత్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం కొత్త పథకాలు అర్హులకు అందించే విధంగా తమ వంతు కృషి చేయాలని కోరారు. నిరుపేదలకు నిస్వార్ధంగా సేవలందించి మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాం మధు ముదిరాజ్, కదిరి గోపాల్ రెడ్డి, అబ్రబోయిన రాజేందర్, అబ్రబోయిన రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


