దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ ఎంపీడీవో మధురిమ ను దోమకొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. దోమకొండకు ఇటీవల బదిలీపై వచ్చిన ఎంపీడీవోను శాలువతో సన్మానించి అభినందించారు. దోమకొండ మండలంలో దోమకొండ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అర్హులను గుర్తించి అమలు చేయాలని కోరారు. మండల అభివృద్ధిలో మండల అభివృద్ధి అధికారికి తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కదిరే గోపాల్ రెడ్డి, అబ్రబోయిన రాజేందర్, ఆబ్రబోయిన రాజు, అధికారులు పాల్గొన్నారు.


