దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు , కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి బలగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించినట్లు తెలిపారు. మండల ఉప సర్పంచ్ పోరం అధ్యక్షునిగా సిరిగాధ మహేందర్ గౌడ్(ముత్యంపేట్), మండల ఉప సర్పంచ్ ఉపఅధ్యక్షునిగా జాలిగామ స్వామి(సీతారంపల్లీ), కార్యదర్శిగా నీల శ్రీనివాస్(చింతమంపల్లి) , గార్లని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ కార్యక్రంలో భాగంగా బొమ్మర శ్రీనివాస్, సత్య గౌడ్, నీల స్వామి, ప్రభాకర్, సతీష్, చిన్నోల పద్మ, పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కమలాకర రెడ్డి ఆదేశం మేరకు హలో ఉపసర్పంచ్ చలో హైదరాబాద్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి దోమకొండ మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు శ్రీ సిరిగాధ కూడా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ ల హక్కుల కోసం పోరాడుతానని , ప్రభుత్వ ఉప సర్పంచ్ చెక్ పవర్ పై వస్తున్న వదంతులను ఖండించాలని అన్నారు.ఈ కార్యక్రంలో భాగంగా బొమ్మర శ్రీనివాస్(దోమకొండ), సత్య గౌడ్(అంబరిపేట), నీల స్వామి(సంగమేశ్వర్), ప్రభాకర్(అంచనూరు), సతీష్(లింగుపల్లి), చిన్నోల పద్మ(గొట్టిముక్కుల), పాల్గొన్నారు.


