దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శివరాం మందిరం దేవస్థానంలో వందల సంవత్సరాల నాటి రథశాల పై కప్పు వర్షాలకు పడిపోవడంతో రథశాల నిర్మానుష్యంగా మారింది. చరిత్ర కలిగిన రథశాల పరిరక్షణ కోసం గ్రామస్తులు, ఆలయ కమిటీ వారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి షెడ్డు నిర్మాణానికి ఆయన సొంత నిధులను మంజూరు చేసి పనులు పూర్తి చేశారు. ఆయన త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. రథశాల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


