కుమారుడి జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
*నిస్వార్ధంగా రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి..
*రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో సదాశివ నగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి కుమారుడు మహన్ష్ రెడ్డి మూడవ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేయడమే కాకుండా,యువతలో రక్తదానం పట్ల అవగాహనను కల్పిస్తూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఇటీవలే రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సామల సంతోష్ రెడ్డి ఆదర్శంగా నిలవడం జరిగిందని,కామారెడ్డి రక్తదాతల సమూహ పిలుపుమేరకు వారి కుమారుడు మహాన్ష్ రెడ్డి మూడవ జన్మదినం సందర్భంగా 48 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని అన్నారు. రక్తదాతకు అభినందనలు తెలియజేశారు.


