స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం
డోన్ డిప్యూటి తహశీల్దార్ పి.మధు
సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
మే 20 న మన దేశ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి సందర్బంగా మరియు స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్థంతి సందర్బంగా*
డోన్ పట్టణం లో ఎమ్మార్వో కార్యాలయం నందు
సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ పి. మధు అధ్యక్షతన మే 20 న మన దేశ స్వాతంత్ర్యసమరయోధులు శ్రీ బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి సందర్బంగా మరియు స్వాతంత్ర్య సమర యోధులు ఆంధ్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతులను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బి. మధు సుధాకర్ డిప్యూటి తాసిల్దార్ రీసర్వే, జి. జాకీర్ హుస్సేన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, కే.వి. ఉపేంద్ర జూనియర్ సహయకులు, వీఆర్వోలు, అటెండర్ వలి ,ఎమ్మార్వో అఫిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డోన్ డిప్యూటీ తహశీల్దార్ పి. మధు,సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డిప్యూటీ తహశీల్దార్ పి. మధు, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…