ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ…

ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి;!జూలై 11 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇల్చిపూర్ రోడ్డులో ఓల్డ్ ఎస్ పి ఆర్ స్కూల్ వెనుక ఉన్న ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు, దైనందిన జీవనం, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వృద్ధుల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి ధైర్యం చెప్పిన గడ్డం ఇందుప్రియ, సమాజంలో పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వృద్ధులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వం మరింత ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి, వారి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది,ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!