దిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) నాటికి భాజపా (BJP)కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై (Opposition Unity) ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు సాగుతోన్న విషయం తెలిసిందే..
ఈ క్రమంలోనే బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ (Nitish Kumar) ఆదివారం దిల్లీ (Delhi) సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తో భేటీ అయ్యారు. బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్తో కలిసి దిల్లీకి వెళ్లిన నీతీశ్.. కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్లా ఓ ‘రాజ్యసభ ప్లాన్ (Rajyasabha Plan)’ను నీతీశ్ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.



