ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.
ద్రోణి ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక వడగాల్పులపైనా అధికారులు కీలక సూచనలు చేశారు. మన్యం జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, వీరపనాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాల్లో, విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం.. కడప జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలో ఒక మండలంలో వడగల్పులు వీచాయని వెల్లడించారు.