గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం

నాతవరం సెప్టెంబర్ 15 అఖండ భూమి

గునుపూడి లో అక్రమ బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతుందని మద్యంతో పాటు నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్న సమయంలో అంతే కాకుండా మద్యం పాలసీ పై నూతన నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆ విషయాన్ని గమనించిన చట్ట అవిధేయ వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ మద్యం వ్యాపారాలు చేస్తూ వీరి ద్వారా అక్రమ బెల్ట్ షాపులలో, కిరాణా షాపులలో, ఇళ్లల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని, మద్యం బాటిల్ కొనుగోలుపై బాటిల్ ధర కంటే అత్యధికంగా 80 రూపాయలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!