జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లా కేంద్రమైన కర్నూలులో గత రాత్రి – 21-05-2023న ఆదివారం కవరేజ్ చేసేందుకు వెళ్ళిన విశ్వభారతి హాస్పిటల్ వద్దకు వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసి కెమెరాలు ధ్వంసం చేసిన వారి మీద.. చట్ట కట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెల్దుర్తి ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ సంఘం యూనియన్ నాయకులు కోరడమైనది. అనగా 21 ఆదివారం న్యూస్ కవరేజ్ కొరకు విశ్వ భారతి హాస్పిటల్ దగ్గరకు వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసి కెమెరా అను ధ్వంసం చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ వినతి పత్రం అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు షేక్ అమీర్, చంద్రశేఖర రావు, మారెన్న, అంజి, అశోక్, చిన్న దస్తు తదితరులు పాల్గొన్నారు.