మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావుక్రిష్ణగిరి సెప్టెంబర్ 17 (అఖండ భూమి) :
మండల పరిధిలోని పొట్లూరు గ్రామంలో జరుగుతున్నటువంటి మారెమ్మ జాతరను సజావుగా జరుపుకోవాలని వెల్దుర్తి సీఐ బి మధుసూదన్ రావు అన్నారు. మంగళవారం జాతరలో జరుగుతున్న ఉత్సవాలను తిలకించారు. మాతా మారెమ్మ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని భక్తులకు సూచనలు ఇచ్చారు. జాతర సందర్భంగా అయినటువంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ముందుగా జాతర ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో సిఐ మధుసూదన్ రావు, క్రిష్ణగిరి ఎస్సై, వెల్దుర్తి ఎస్ఐ అశోక్, ఎస్బిఐ టేబుల్ ఖాజ, పోలీస్ సిబ్బంది జాతరలోని భక్తులు తదితరులు ఉన్నారు.