అమరావతి అఖండ భూమి వెబ్ న్యూస్ :
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్రెడ్డిపై (mp avinash reddy) సీబీఐ చేస్తున్న విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ఈ విషయంలో సీఎం జగన్ ఎక్కడా జోక్యం చేసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) అన్నారు..
మంగళవారం ఆయన విలేకరులతో అనేక విషయాలపై మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన నిధుల అంశంపైనా స్పందించారు.
”ఒక బాధ్యత కలిగిన ఎంపీగా అవినాష్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కడా తప్పించుకోలేదు.. ఇప్పటికే ఆరేడుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తన తల్లికి బాగోలేకపోవడంతో విచారణకు హాజరు కాలేనని అవినాష్ చెప్పారు. విచారణకు వచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. అవినాష్ అరెస్టుకు కర్నూలు ఎస్పీ సహకరించడ లేదనడం ఊహాగానాలను ప్రచారం చేయడమే. అవినాష్ విషయంలో ఏమిటీ అన్యాయమని అనుకునేవారు కర్నూలుకు వస్తున్నారు..



