ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు (మినీమహనాడు)లో మాజీ మంత్రి కీడారి శ్రావణ్ కుమార్.
అల్లూరి జిల్లా; అనంతగిరి అఖండ భూమి వెబ్ న్యూస్ :
అరకు పార్లమెంట్ మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరులో మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు (మినీమహనాడు) సందర్బంగా అశేషాజన వాహిని నడుమ జరిగింది ఈ సందర్బంగా
మాజీ మంత్రులు చింతకాయల అయ్యన పాత్రుడు,కిమిడి కళ వెంకటరావు,తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇంచార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జులు రాష్ట్ర,పార్లమెంట్ అసెంబ్లీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.