కొండమ్మ కుటుంబన్ని పరామర్శించిన:మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్

 

 

మాజీ ఎంపీటీసీ కొర్ర కొండమ్మ భర్త కొర్ర రమణ పిడుగు పడి మరణించడం చాలా బాధాకరం, కొండమ్మ కుటుంబన్ని పరామర్శించిన:మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్

అల్లూరి జిల్లా: అనంతగిరి  అఖండ భూమి వెబ్ న్యూస్ : అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ మాజీ ఎంపీటీసీ కొర్ర కొండమ్మ భర్త కొర్ర రమణ బుధవారం పిడుగు పడి స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇంచార్జి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ గుమ్మకోట గ్రామానికి చేరుకుని కొండమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఎంపీటీసీ భర్త రమణ మరణించడం చాలా బాధాకరమని కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధ కలుగుతుందాని కొండమ్మ కుటుంబాన్ని అండగా ఉంటామని ఏ సమస్య ఉన్నా తమ ద్రుష్టికి తీసుకు రావాలని టీడీపీ పార్టీ అండగా ఉంటుందని దైర్యంగా ఉండాలని తోడుగా ఉంటామని మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వేంట అరకువేలి మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, అరకు పార్లమెంట్, బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు, అరకు అసెంబ్లీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దన్నయిక రమేష్,త్రినాధ్,చట్టు అప్పలరాజు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!