- నంద్యాల జిల్లా, బేతంచర్ల లో ప్రచార బేరి పాదయాత్ర
బుగ్గానపల్లి తండా,బుగ్గానిపల్లి గ్రామాలలో ప్రచార బేరి పాదయాత్ర కార్యక్రమం నిర్వహించి కేంద్రం బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరపత్రం పంపిణీ చేస్తూ ఎనిమిదవ రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త బస్టాండ్ చేరుకుని కొత్త బస్టాండ్ నుండి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వైభీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ర్యాలీగా పాత బస్టాండ్ సర్కిల్ వరకు పోవడం జరిగింది. పాత బస్టాండ్ సర్కిల్లో గల భారత్ బేకరీ దగ్గర సిపిఎం పార్టీ చేపట్టిన ప్రచార బేరి పాదయాత్ర కార్యక్రమం ముగింపు సభ నిర్వహించడం జరిగింది.ఈ ప్రచార బేరి పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ టి రమేష్ కుమార్ గారు హాజరయ్యారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వై.ఎల్లయ్య, సిపిఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అర్.ఈశ్వరయ్య,లతో పాటు ప్రజానాట్యమండలి నంద్యాల జిల్లా కన్వీనర్ కోయిలకొండ నాగరాజు బృందం వారు పాడిన పాటలు పార్టీ శ్రేణులను మండల ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిలు ఎన్.కె.నాగలక్ష్మి, ఆర్.వెంకటలక్ష్మి, ఎస్.కె.భాష,కె.రాజబాబు, బి.నరసింహుడు,పి.నాగరాజు, కె.ఆంజనేయులు


