అంబేద్కర్ జ్ఞానమే దళితులలో చైతన్యం…

  1. అంబేద్కర్ జ్ఞానమే దళితులలో చైతన్య వచ్చిందని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్ హెచ్ బోయినపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సభ అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి దాది పోగు నవీన్ మాదిగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధికారికంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే జలదొడ్డి సుధాకర్  హాజరయ్యారు. స్థానిక అధికారులు తాసిల్దార్ పి .రాజేశ్వరి  హాజరయ్యారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు హాజరై అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు అంబేద్కర్ లేకపోతే దళిత గిరిజనులు బీసీలు జీవన విధానం అగమ్య గోచరంగా ఉండేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి వైఎస్ఆర్సిపి యువ నాయకులు అశోక రెడ్డి, కొమ్మూరు కనకరావు కొమ్ముపాలెం శ్రీనివాసులు ఎరుకల రాజు దాసరి సువర్ణ రాజు బొమ్మన రవి రెడ్డి  దేశాయ్ సమీర్ కుమార్ రెడ్డి జెడ్పిటిసి సుంకన్న సిఐ యుగేందర్ ఎస్సై టి చంద్రశేఖర్ రెడ్డి, అగస్టీన్, దళిత సంఘాల నాయకులు వైయస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
Akhand Bhoomi News

error: Content is protected !!