సివిల్స్ ర్యాంకర్ కి కాపునాడు ప్రత్యేక అభినందన
మామిడికుదురు అఖండ భూమి వెబ్ న్యూస్
ఇటీవలే సివిల్స్ ఫలితాల్లో 583 ర్యాంకు సాధించిన యర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మి రమణి కి ప్రత్యేక అభినందనలు తెలిపిన కాపునాడు అధ్యక్షులు అబ్బిరెడ్డి సురేష్. గురువారం ఆమె స్వగృహం ఈదరాడ గ్రామంలో ఆమెను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ఆకుల ఈశ్వరరావు, కాకిలేటి దుర్గారావు, అబ్బిరెడ్డి మూర్తి తదితరులు పాల్గొన్నారు.



