వాలంటీర్లు సేవలు అభినందనీయం….

 

వాలంటీర్లు సేవలు అభినందనీయం….

కోటనందూరు (అఖండ భూమి). ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి గా ఉండే వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయం అని మండల ఎంపీపీ ఎల్ శ్రీనివాస్ అన్నారు. గురువారం కోటనందూరు మండలం బిల్లా నందూరు, జగన్నాధపురం, బో ద్ద వరం గ్రామాలలో వాలంటీర్ల అభినందనీయ కార్యక్రమం జరిగినది. ఆ గ్రామాలలో వాలంటీర్లను మండల ఎంపీపీ, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేలా చూడాలని అన్నారు. నిర్విద్ధ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు గుర్తింపుగా ఈ సత్కార కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లెక్కలు ఉపేంద్ర, వే గి లక్ష్మీ అప్పలనాయుడు, బొచ్చ మంగ సత్తిబాబు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, వైఎస్ఆర్సిపి నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!