ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా కంభం( అఖండ భూమి న్యూస్ ) పట్టణ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతుడు కంభం పట్టణానికి చెందిన రామారావుగా (48) పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రస్తుతం కురిచేడులో పూల వ్యాపారం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడని మృతుడు కంభం వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అని పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక నష్టాలతో రామారావు ఆత్మహత్య ఏమైనా చేసుకున్నాడా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం