ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా కంభం( అఖండ భూమి న్యూస్ ) పట్టణ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతుడు కంభం పట్టణానికి చెందిన రామారావుగా (48) పోలీసులు గుర్తించారు. మృతుడు ప్రస్తుతం కురిచేడులో పూల వ్యాపారం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడని మృతుడు కంభం వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అని పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక నష్టాలతో రామారావు ఆత్మహత్య ఏమైనా చేసుకున్నాడా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



