త్యాగమంటే మాత రమాబాయి అంబేడ్కర్ గారిదే.

 

త్యాగమంటే మాత రమాబాయి అంబేడ్కర్ గారిదే.

– న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి

గోదావరిఖని మే 27  అఖండ భూమి వెబ్ న్యూస్ :

అంటే మాత రమా బాయి అంబేడ్కర్ గారిదే అని న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి పేర్కొన్నారు.మాతా రమాబాయి అంబేడ్కర్ గారు తన నలుగురు పిల్లలను,తన ఆరోగ్యాన్ని,తన జీవితాన్ని,ఒక స్త్రీగా తన ఆశలను, కోరికలను కోల్పోయింది కానీ ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థయిర్యాన్ని మాత్రం కోల్పోలేదు అని ఈదేశంలోని కోట్లాది మంది ప్రజలకు ప్రాణమయ్యిందీ అని బడుగు బలహీవర్గాలకు వెలుగులు నింపే క్రమంలో సమిధఅయ్యింది అని కొనియాడారు. నేడు శనివారం ఆమహా తల్లీ 88వ,వర్థంతి సందర్భంగా ఆతల్లికి న్యూ ఇండియా పార్టీ పక్షాన జనగామ తిరుపతి ఘన నివాళులు అర్పించారు. రమాబాయి అంబేడ్కర్ గారి త్యాగంతోనే దేశంలోని అణగారిన ప్రజలు బ్రతుకుతున్నారు అని ఆఅమ్మకు వందనం అంటు ఆత్యాగాల తల్లికి పాదాభివందనలు చేశారు. అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకే వెళ్తాం అని ఈసందర్బంగా శబథం చేశారు. ఈ ప్రపంచంలో ఎవరికయినా అన్యాయం చేశానంటే అది కేవలం నా భార్య రమాభాయికి మాత్రమే అని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు అన్నారు అని గుర్తు చేశారు.

పౌష్టికాహార లోపంతో నలుగురు పిల్లలను పోగొట్టుకున్న కడుపుకోతను అనుభవిస్తూ కూడా పిడకలు చేసి సంపాదించిన డబ్బును విదేశాలలో ఉన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి చదువులకు పంపించి ప్రోత్సహించిన అమ్మ త్యాగం అనిర్వచనీయం అని ఉద్ఘాటించారు. తల్లీ

చివరకు భావిభారత నిర్మాత భార్య వైద్యం చేపించుకొలేని స్థితిలో మరణించడం అత్యంత బాధాకరం అని మాతా రమాబాయి అంబేడ్కర్ గారి 88వ వర్ధంతి సందర్భంగా న్యూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి స్మరించుకుంటు వారికి ఘనంగ నివాళులు అర్పించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!