పేరుకుపోతున్న ధాన్యం నిలువలు, పట్టించుకోని ప్రభుత్వం: బొల్లు దేవేందర్.
ములుగు జిల్లా, అఖండ భూమి వెబ్ న్యూస్ :
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ అన్నారు.మండలంలోని 18 గ్రామపంచాయతీ పరిధిలో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు లారీలు రాక పేర్కపోయి కొనుగోలు కేంధ్రంలోనే ధాన్యం బస్తాలతోనే పడిగాపులు పడవలసిన పరిస్థితి ఉంది అన్నారు. రైతు ప్రభుత్వం మాది అనే పాలకులకు,లారీలు సమకూర్చాలనే ఆలోచన ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నించారు. గతంలోనే తూకాలు వేయక, వేసినా లారీలు సప్లైచేయక,వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి రైతులు చాలా నష్టపోయారు అన్నారు. మల్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు లారీలను సమకూర్చాలని కోరారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



