అమ్మవారి ముఖ ద్వారా ప్రతిష్టాపన.                        

 

బడుగువానిలంక గ్రామంలో శ్రీ కర్లమ్మ అమ్మవారి ముఖ ద్వారా ప్రతిష్టాపన.

ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో పచ్చని పంట పొలాల్లో వెలసినటువంటి శ్రీ కర్లమ్మ అమ్మవారి ముఖద్వారం నిర్మించడం జరిగింది.ఆ యొక్క ముఖద్వారం మీద అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చెముడులంక గ్రామ సర్పంచ్,ఆలమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తమ్మన శ్రీనివాస్ సుబ్బలక్ష్మి దంపతులు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో కర్లమ్మ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండి,కోరిన కోర్కెలు తీర్చే ఈ చల్లని తల్లి రైతులను ప్రజలను చల్లగా చూసి దీవించాలని ఆ అమ్మవారిని దర్శించుకుని కోరుకున్నామన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!