ఎస్ రాయవరం మండలంలోని గెడ్డపాలెం గ్రామంలో అక్రమంగా మధ్యాన్ని అమ్ముతున్న వ్యక్తిని తన సిబ్బందితో దాడి చేసి అరెస్ట్ చేసినట్లు స్థానిక ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు వివరాల్లోకి వెళ్తే విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో గెడ్డపాలెం గ్రామానికి చెందిన కర్రి గణేష్ అనే వ్యక్తి దగ్గర అక్రమంగా ఉన్న 87 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు 13050 రూపాయలు ఉంటుందని నిందుతుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని తెలిపారు