కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు విరుపాపురం గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉరుములు మెరుపులు కూడుకున్న వర్షం రావడంతో సొంత పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో ప్రమాదం సంబంధించినట్టు స్థానికులు తెలిపారు.