ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
తుగ్గలి ఏప్రిల్ 27 (అఖండ భూమి) :
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని తుగ్గలి సచివాలయ కన్వీనర్ వన్నూరు బి అన్నారు.గురువారం తుగ్గలి లో మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గృహసారథులు, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను వివరించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందలేదా అని ఇంటింటికి వెళ్లి తెలుసుకున్నారు. దీంతో గ్రామస్తులంతా తమకు నవరత్నాల పథకాలన్నీ అందాయని వివరించారు. ఈ సందర్భంగా వన్నూరుబి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంపన్న వర్గాలు లబ్ధి పొందారని, అయితే జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కు రూ లక్ష నుండి రూ 5 లక్షల దాకా జగనన్న ఇవ్వడం జరిగిందన్నారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికలలో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే శ్రీదేవమ్మను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుటకు ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గృహసారథులు ప్రతాప్, సుశీల, వాలంటీర్లు చంద్రిక, రాము తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం