సర్వేయర్ హేమంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి
వెల్దుర్తి మండలంలో భూసమస్యలపై సర్వేచలానలు కట్టి నెలలు గడుస్తున్న సర్వే చేయకుండా రైతులను ఇబ్బంది. పెడుతున్న సర్వేయర్ హేమంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. జగన్నాథం, సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శిటి.కృష్ణలు డిఆర్డీ నాగేశ్వరరావు కోరారు. గురువారం స్థానిక జిల్లాకలెక్టరేట్ డిఆర్డీ నాగేశ్వరరావు కలిసి వారు వినతి పత్రం అందిపా “జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలో రోజురోజుకు భూముల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, భూముల సమస్యలపై సర్వే చలానలు కట్టిన నెలలు గడుస్తున్న సర్వేయర్స ర్వే చేయకుండా రైతులను ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. సర్వేయర్ హేమంత్ రెడ్డిని కలిస్తే రేపురాపో, ఎల్లుండి రాపో అని చెప్పి రైతులను మభ్యపెడుతున్నారన్నారు. గ్రామాలలో సర్వేయర్ పొలాలకు రాకపోవడం వలన గొడవలు జరుగుతున్నాయని, తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించలేనటువంటి సర్వేయర్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాధవకృష్ణ. జి. బాలురాజు, రైతులుసీమోను,రాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం