ప్యాపిలి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా సుదర్శన్ రావు

 

 

ప్యాపిలి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా సుదర్శన్ రావు

కర్నూలు ప్యాపిలి అఖండ భూమి వెబ్ న్యూస్ :

ప్యాపిలి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా సుదర్శన్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎ.వెంకటేశ్వర్లు కర్నూలు ఎస్ బిఐ కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఒంగోలు ఎస్ బిఐ బ్యాంకు లో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ రావు ప్యాపిలి ఎస్ బిఐ కి బదిలీ పై ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుకు వచ్చే కస్టమర్లే మాకు దేవుళ్ళు అంటూ వారికి బ్యాంకు పరంపరమైన ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సీజనల్ టమోటో ,మామిడి వ్యాపారస్తులకు లావాదేవులకు గాను కరెంట్ అకౌంటు చేయిస్తామన్నారు, అలాగే పి ఎం జె వై కింద జీరో అకౌంట్ లో కూడా ఇస్తామని, అలాగే అర్హులైన వారికి ముద్రలోను కూడా ఇస్తామని అన్నారు. ప్రస్తుతం బ్యాంకులో క్రాప్ లోన్లు, పర్సనల్ లోన్లు సక్రమంగా చెల్లిస్తున్నారని తమ బ్యాంకుకు వచ్చిన కస్టమర్లను నిరుత్సాహపడకుండగా సహాయ సహకారాలు సేవలు తమ తోటి సిబ్బంది కూడా సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!