156 వాహనాల వేలం .
కర్నూలు జిల్లా (అఖండ భూమి)
వివిధ నేరాల్లో, అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 156 వాహనాలకు వేలం ఏప్రిల్ 30 (ఆదివారం) , మే 1 (సోమవారం) 2 రోజుల పాటు వేలం నిర్వహించబడుతుందని కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్ గారు శుక్రవారం తెలిపారు.
76 వాహనాలకు కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ లో ఏప్రిల్ 30 (ఆదివారం) , మే 1 (సోమవారం)
53 వాహనాలకు ఓర్వకల్లు పోలీసుస్టేషన్ లో ఏప్రిల్ 30 (ఆదివారం) , మే 1 (సోమవారం)
14 వాహనాలకు సి.బెళగల్ పోలీసుస్టేషన్ లో
8 వాహనాలకు గుడూరు పోలీసుస్టేషన్ లో
5 వాహనాలకు కోడుమూరు పోలీసుస్టేషన్ లో వేలం వేయనున్నారు.
ఉదయం 10 గంటలకు కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్ గారి ఆధ్వర్యంలో ఆయా పోలీసు అధికారుల సమక్షంలో వాహానాల వేలం ప్రారంభమవుతుంది.
ఆసక్తి ఉన్న వారు అదే రోజున తగిన ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చు. ఆధార్ కార్డు ఖచ్చితంగా జిరాక్స్ తెచ్చుకోవాలన్నారు.
వేలం పాటలో దక్కించుకున్న వాహనం కు సంబంధించిన వాహానం ధర మొత్తం ను అదే రోజు సంబంధిత అధికారులకు చెల్లించి వాహనాలుస్వాధీనపరచుకోవచ్చన్నారు.జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



