గొలుగొండ మండలం జోగుంపేట గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు వాసం వెంకటేష్ కోన నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేవ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సామాన్య ప్రజల బ్రతుకులు మారాలంటే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు పేదల బతుకుల్లో వెలుగులు నింపడం పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే సాధ్యమని హితవు పలికారు ఈ సందర్భంగా జన సైనికులు ప్రతీ ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నారు సూర్యచంద్ర మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు ఇళ్ల లేఅవుట్ల పూర్తి స్థాయిలో ఇచ్చిన పరిస్థితి లేదన్నారు తాండవ నిర్వాసితులకు రావాల్సిన 80లక్షలు ఇచ్చిన దాఖలా లేదన్నారు అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వలేదని ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని గ్రామస్ధులు చెబుతున్నారని తెలిపారు గ్రామాల్లో ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయని అయినా స్థానిక ఎమ్మెల్యే గానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు ప్రజల్లో మార్పు మొదలైందని రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు నిస్వార్ధ నిజాయతి నైతిక విలువలు తో కూడిన రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు ప్రజలు స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలికి నిస్వార్థం గా ప్రజల పక్షాన పోరాడే జనసేన పార్టీని ఓట్లేసి గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగుబళ్ల శివ మళ్లి ఉపేంద్ర నమ్మి రమణరాజు జనసైనికులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం